హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పది దేశాలకు చెందిన 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు నాలుగు రోజుల పర్యటన కోసం రాష్ర్టానికి వచ్చారు. ఈ బృందం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యాకేంద్రాలను సందర్శించనున్నది. ఈస్ట్ ఆసియా, యూరేషియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని జార్జియా, ఆర్మేనియా, ఇరాన్, బెలారస్, తుర్కెమినిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, మంగోలియా, కజకిస్థాన్కు చెందిన మీడియా ప్రతినిధులు బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. వీరికి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమాచార, పౌర సంబంధాలశాఖ అధికారులు, ప్రొటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు.
సచివాలయ సీఎస్వోగా గంగారాం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సచివాలయ సీఎస్వోగా స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ టీ గంగారాంను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన 17వ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రాను ఇబ్రహీంపట్నంలోని 3 బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు.
చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు7)ను పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డులకు చేనేత కళాకారుల నుంచి చేనేత, జౌళిశాఖ జూలై 10 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఉత్తమ రచనలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
తెలుగు యూనివర్సిటీ, జూన్ 26. తెలుగు సాహిత్యంలో ఉత్తమ గ్రంథాలకు 2024 రాష్ట్ర స్థాయి పురస్కారాల ను తెలంగాణ సారస్వత పరిషత్తు బుధవారం ప్రకటించింది. పద్యగేయ కవిత్వంలో బాబు దేవీదాసశర్మ రచించిన ‘శ్రీరామాయణోపనిషత్తు’, వచన కవితలో నిర్మలారాణి రచించిన ‘అద్దం నా చిరునామా కాదుగా’, నవలా ప్రక్రియలో ఉపేందర్ రచించిన ‘మత్తడి దునికిన కోపుల నీళు’్ల, సాహిత్య విమర్శలో రాజ్కుమార్ రచించిన ‘తెలంగాణ కవిముద్ర’, కథా ప్రక్రియలో రవీందర్ రచించిన ‘కండిషన్స్ ఐప్లె’ పురస్కారాలకు ఎంపికైనట్టు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పేర్కొన్నారు.
దివ్యాంగులకు 5% రిజర్వేషన్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యాసంస్థలు బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న దివ్యాంగులకు 5శాతం కంటే తకువ సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది..