Maoist Encounter | ములుగు : ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో తుపాకులు గర్జించాయి.. తూటాల వర్షం కురిసింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. తాడ్వాయి మండలం అల్లిగూడెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల చేతిలో మృతి చెందిన మావోయిస్టును నల్లమూరు అశోక్ అలియాస్ విజేందర్గా పోలీసులు గుర్తించారు. మృతుడు అశోక్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం వాసిగా నిర్ధారించారు.
నల్లమూరు అశోక్ అలియాస్ విజేందర్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడన్న వార్త తెలుసుకుని బుద్దారం వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత పదేండ్ల క్రితమే విజేందర్ ఊరు విడిచి వెళ్లిపోయాడని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అయితే అతను ఎక్కడున్నాడనే విషయం ఇప్పటి వరకు గ్రామస్తులకు తెలియదు. కానీ విజేందర్ ఇవాళ పోలీసుల చేతిలో తూటాలకు బలయ్యాడని తెలియడంతో బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక బుద్దారంలో పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Telangana Budget | భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు : ఆర్థిక మంత్రి
Telangana Budget | 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం: భట్టి విక్రమార్క
Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు