హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఈ నకిలీ మద్యం కంపెనీ, రుణాల ఎగవేతతో మధ్యప్రదేశ్ను లూటీ చేసిందని శుక్రవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.
అలాంటి కంపెనీని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని, తెలంగాణను కూడా లూటీ చేసేందుకు ఈ కంపెనీని ఇక్కడికి తీసుకొస్తున్నారా? అని ప్రశ్నించారు.