హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనను సీఎం స్మరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అకంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించామని గుర్తుచేశారు. గోలొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు సీఎంను ఆయన నివాసంలో కలిసి ఆషాఢ బోనాలకు రావాలని ఆహ్వానపత్రిక అందించారు.