హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు. సురేశ్ షెట్కార్, ఈటల రాజేంద ర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూ రు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ తెలుగులో, గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందన్రా వు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రామసహా యం రఘురాంరెడ్డి ఇంగ్లిష్లో, గో డెం నగేశ్ హిందీలో, అసదుద్దీన్ ఒవై సీ ఉర్దూలో ప్రమాణం చేశారు.
సురేశ్ షెటార్, రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఒవైసీ, మల్లు రవి, రఘువీర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డి .. ‘జై తెలంగాణ’ అని నినదించారు. జై సమ్మక సారలమ్మ అని ఈటల, జై లక్ష్మీనర్సింహస్వామి అని కిరణ్కుమార్రెడ్డి, జై భద్రకాళి అని కావ్య, జై తు ల్జాభవాని అని బలరాంనాయక్, జై భీం అని అసదుద్దీన్, మల్లు రవి, కా వ్య, రఘురాంరెడ్డి నినదించారు.
జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం పూర్తిచేశారు. జై పాలస్తీనా అని నినదించడం పై మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రికార్డుల నుంచి ఆ పదాలను తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్సింగ్ పేర్కొన్నారు.