హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడంపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులెవరో తేల్చాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి సోం డిస్టలరీస్ విషయంలో అనుసరించిన వైఖరి ఆక్షేపణీయంగా ఉన్నదని చెప్పారు.
ప్రజల ఆరోగ్యం దెబ్బతినే విధంగా ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే మంత్రి జూపల్లి సోం డిస్టిలరీస్పై రకరకాల వైఖరుల తీసుకుని చివరకు తోకముడిచారని ఎద్దేవా చేశారు. సోం డిస్టిలరీస్కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
‘మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారు. దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలి. మోసపూరిత కంపెనీ అయిన సోం డిస్టలరీస్కు రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవ్వరో బయటకు రావాలి. దీనిపై మంత్రి జూపల్లి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి’ అని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
లిక్కర్ కేసు ఇక్కడెందుకు పెట్టరు?
ఢిల్లీ లికర్ పాలసీకి సంబంధించి కేసులు పెట్టినప్పుడు, ఇకడ సోం డిస్టిలరీస్ విషయంలో కేసు ఎందుకు నమోదు చేయరని క్రిశాంక్ ప్రశ్నించారు. మద్యం సంస్థలు, బ్రాండ్ల విషయంలో లీకులు ఇచ్చింది రేవంత్ ప్రభుత్వమే..వాటిని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అక్రమ కేసులు పెడుతున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు.
అన్ని శాఖల్లో సాంల మీద సాంలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని విరుచుకుపడ్డారు. సోం డిస్టిలరీస్కు అనుమతి విషయంలో ఎైక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి రెండ్హ్యాండెడ్గా దొరికిపోయారని అన్నారు. సోం డిస్టిలరీ కాంగ్రెస్కు నిధులు సమకూర్చిన సంస్థ అని, ఈ అవినీతిపై లోతైన దర్యాప్తు జరగాలని చెప్పారు.
సోం డిస్టిలరీకి అనుమతుల రద్దు తాతాలికమా, శాశ్వతమా స్పష్టం చేయాలని కోరారు. ఆబారీ ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ అంటుంటే పెరగలేదని మంత్రి జూపల్లి అంటున్నారని తెలిపారు. ఎవరిది నిజమో ప్రభుత్వం ప్రకటన చేయాలని అన్నారు. మంత్రులు అక్రమ ట్యాక్సులు వసూలు చేయడంలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.
సోం డిస్టిలరీకి అనుమతులను తాము అడ్డుకోకపోతే రాష్ట్రంలో కల్తీ మద్యానికి అమాయకులు బలి అయ్యేవారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వంలో బియ్యం స్కాం, బూడిద స్కాం, మద్యం స్కాం ఇలా అనేక కుంభకోణాలు బయటికి రాకుండా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇసుక స్కాంలు అంటూ పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.