హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంతో నమోదైన కేసులో మాజీ మం త్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు ఊరట లభించిం ది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద డ్రోన్ కెమెరాలను వినియోగించి ఇంటర్వ్యూ నిర్వహించడంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు నిరుడు ఈ కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది వివరించారు.