హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రజల కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ తెర్లయిపోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి, కన్ను కుట్టించించిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను వర్ణిస్తూ మంగళవారం కేటీఆర్ ఎక్స్లో కవితను పోస్టు చేశారు.
‘తలాపున గోదారి గలగల పా రుతున్నా తనువంతా ఎడారై ఎండి న శాపానికి విమోచనం కాళేశ్వరం’ అం టూ కాళేశ్వరం ఘనతను కేటీఆర్ కవితాత్మకంగా తెలియజేశారు. ‘సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న తెలంగాణ చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం’ అని కుండబద్దలు కొట్టారు. ‘దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం’ అని అభివర్ణించారు. ‘శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్సాగర్కు పునరుజ్జీవమిచ్చిన పుణ్యవరం కాళేశ్వరం’ అని కేటీఆర్ కీర్తించారు.