బేగంపేట, జూలై 3 : మోకాలి కార్టిలేజ్ గాయాలతో బాధపడుతున్న వారికి ఎపీసీలర్ జాయింట్ రీసర్ఫేసింగ్ శస్త్రచికత్స ద్వారా నయం చేయవచ్చని బేగంపేట కిమ్స్ సన్షైన్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. మోకాలి మార్పిడి చేయకుండానే దెబ్బతిన్న కార్టిలేజ్ భాగాన్ని అమర్చే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
బుధవారం ఆస్పత్రిలో సర్జరీ విభాగం వైద్యుడు కుశాల్తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ విధానంలో కిమ్స్ సన్షైన్ ఆస్పత్రిలో 40 ఏండ్ల వ్యక్తికి తెలుగు రాష్ర్టాల్లోనే మొదటి సారిగా శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మోకాలులో దెబ్బతిన్న కార్టిలేజ్ సైజ్ను సీటీ స్కాన్ ద్వారా 3డీ ఇమేజ్ తీసి స్వీడన్కు పంపినట్టు వెల్లడించారు. అక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఇంప్లాంట్ సాయంతో రోగికి దెబ్బతిన్న భాగంలో కార్డిలేజ్ అమర్చినట్లు తెలిపారు.