హైరాబాద్: మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో మారేడ్పల్లిలోని నివాసానికి శంకర్ యాదవ్ మృతదేహాన్ని తరలించారు. ఆయన భౌతికకాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, బీఆఎస్ నేతలు పెద్ది శుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులర్పించారు. మాజీ మంత్రి తలసానిని ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.