కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 20 : వేధింపులు, నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఆర్టీసీ కరీంనగర్ డిపో-1 మేనేజర్ లక్కు మల్లేశం సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
లక్కు మల్లేశం కామారెడ్డి డిపోలో పనిచేసిన సమయంలో సిబ్బందిపై వేధింపులు, దురుసు ప్రవర్తన, నిధుల దుర్వినియోగం, ప్రస్తుతం పనిచేస్తున్న డిపో-1లోనూ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం అంతర్గతంగా విచారణ జరిపారు. అధికారుల నివేదిక ఆధారంగా మల్లేశంను గురువారం సస్పెండ్ చేశారు.