నాంపల్లి కోర్టులు, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అదే పోలీసుస్టేషన్లో నమోదైన కిడ్నాప్, బెదిరింపు కేసులో ప్రొడక్షన్ వారెంట్ (పీటీ)పై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించడంతో నిందితుడిని తిరిగి చంచల్గూడ జైలు కు తరలించారు. తనను కిడ్నాప్ చేసి, నిర్బం ధించి, బెదిరింపులకు గురిచేసి షేర్లు బదలాయించుకున్నారంటూ బాధితుడు చెన్నుపాటి వేణుగోపాల్ ఫిర్యాదుమేరకు మొత్తం తొమ్మిది మందిపై 386,365, 341, 120బీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.