హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): నీట్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
24 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రధాని చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ ఆధ్వర్యంలో కాచిగూడ నుంచి నారయణగూడ ఫ్లైఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు.