హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో అధికారు లు, ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. పోడుభూముల వివాదాలు, పలువురు రేంజ్ ఆఫీసర్లపై వస్తున్న ఫిర్యాదులతో పాటు నెలాఖరున వైల్డ్లైఫ్ చీఫ్ మోహన్ చంద్ర ఫర్గెయిన్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో పూ ర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది.
మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని మార్చాలని నిర్ణయించింది. ప్రధాన రక్షణాధికారిగా ప్రస్తుతం సీఎంవోలో పనిచేస్తున్న ఉన్నతాధికారి లేదా సీనియర్ మహిళా అధికారిణిని నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. అంతర్గతంగా జరిగిన బదిలీలు వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
హరితహారం కార్యక్రమాన్ని ‘వన మహోత్సవం’గా ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. 75వ వనమహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్, హనుమకొండలో ప్రారంభించనున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.