హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడు దలకానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదలచేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. ఈ పరీక్షలను గత మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.