హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఫస్టియర్లో 63%, సెకండియర్లో 46% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిలు ఫస్టియర్లో 79,801 (68.62%), సెకండియర్లో 25,910 (51%) పాసయ్యారు. అబ్బాయిలు ఫస్టియర్లో 77,940 (57.40శాతం), సెకండియర్లో 33,759 (43శాతం) ఉత్తీర్ణత సాధించారు.
2022లో ఫస్టియర్లో 68శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే, ఈ ఏడాది 63 శాతానికి తగ్గింది. సెకండియర్లో నిరుడు 48% ఉత్తీర్ణత సాధిస్తే, ఈసారి 46 శాతానికి పడిపోయింది. విద్యార్థులు కలర్ మెమోలను శనివారం నుంచి ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈ నెల 12 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తుకు అవకాశం ఉన్నది.
మార్చి, తాజా ఫలితాలు కలుపుకుంటే ఫస్టియర్ జనరల్ కోర్సుల్లో 3,17,802 (73.38శాతం), వొకేషనల్లో 35, 863 (72.31శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి, తాజా ఫలితాలు కలుపుకుంటే సెకండియర్ జనరల్ కోర్సుల్లో 3,25, 208(77.57శాతం), వొకేషనల్లో 36, 749 (79.52శాతం) విద్యార్థులు పాసయ్యారు.