Inter Admissions | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు గడువు పొడిగించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. నిన్న టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సప్లిమెంటరీ ఫలితాల్లో పాసైన విద్యార్థుల కోసం ఫస్టియర్లో ప్రవేశాల గడువును పొడిగించారు.
ఇక ఇంటర్లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ జాబితా ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.