హైదరాబాద్, జూలై 2: ఈ ఏడాదికిగాను 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరుగనున్నది. ఈ నెల 5-7 తేదీల్లో మూడు రోజులపాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఈ సదస్సును నిర్వహించనున్నది.
‘ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర’ అనే థీమ్తో ఈసారి సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు 9,000 మంది నిపుణులు, పరిశోధకులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆహ్వానించింది.
నోకియా కంపెనీకి చెందిన ఓ ప్రతినిధిబృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. వీరిలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్తోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతోనూ భేటీ అయ్యారు.