మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం ఇన్ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 12,500 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహం కారణంగా పలు పరిశోధనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. డౌన్ స్ట్రీమ్లో పియర్ల వద్ద ఉన్న ఇసుక కొట్టుకుపోకుండా ఏర్పాటు చేసిన రాళ్లను సరిచేస్తున్నారు.