హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు పాటు అక్కడక్కడ ఉపరితల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, నిర్మల్, జగిత్యాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసినట్టు తెలిపింది. జూలై 5 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ తేదీ కన్నా ఆరు రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. జూన్ 11 నుంచి 27 వరకు దేశంలో 16 రోజులపాటు సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదైందని తెలిపింది.