పాలమూరు ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎన్. నవీన్ కుమార్ రెడ్డికి భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అని ఈ సందర్భంగా ఎన్. నవీన్కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్కు కూడా ఈ జిల్లా వెన్నుదన్నుగా నిలబడిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కేసీఆర్కు పట్టం కట్టడానికి ఈ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉంటారని అన్నారు.