హైదరాబాద్: జలాశయాల సమీపంలో కట్టుకున్న అధికార పార్టీకి చెందిన ప్రముఖుల రాజభవనాల జోలికి వెళ్లని హైడ్రా (HYDRA).. సామాన్యులు, ఇతరుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు (Nagarjuna) చెందిన ఎన్ కన్వెన్షన్ను (N Convention) కూల్చివేస్తున్నది. మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ను తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. కన్వెన్షన్కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. అదేవిధంగా కూల్చివేతల చిత్రీకరణకు మీడియాకు అనుమతి లేదంటూ బారికేడ్లతో మూసివేశారు.
కాగా, మొత్తం 10 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు.
హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తున్న హైడ్రా
హైదరాబాద్ – మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం.. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తిమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్… pic.twitter.com/zAAXVRpYku
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024