హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొందరు సం స్థలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏజెన్సీల కమ్యూనికేషన్స్ అన్నీ వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతుండటంతో అక్రమార్కులను గుర్తించడం కష్టమవుతున్నదని తెలిపారు. మోసపూరిత హామీలతో అడిగినంత డబ్బు ఇచ్చి విదేశాలకు వెళ్లినవారు అక్కడ కష్టా లు పడుతున్నారని పేర్కొన్నారు. రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెంట్లు.. వలస కార్మికుల కోసం ప్ర వాసీ భారతీయ బీమా యోజన వర్తింపజేసే స దుపాయం కల్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిందని పేర్కొన్నారు. www.emigrate. gov.inని సందర్శించడం ద్వారా రిజిస్టర్డ్ సంస్థ ల వాస్తవికతను పరిశీలించవచ్చని సూచించారు. ఏజెన్సీల మోసం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1800113090, వాట్సాప్ నెంబర్ +91 742 8321144కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.