హైదరాబాద్: రుణమాఫీలో లబ్ధిదారుల సంఖ్య తక్కువవడంపై వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. అప్పుడు రూ.17 వేల కోట్లు అయ్యాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులు 11.5 లక్షల మంది రైతులు మాత్రమే ఎలా ఉంటారని ప్రశ్నించారు.
రూ.6800 కోట్లు ఇస్తే మొత్తం ఎలా మాఫీ అవుతాయన్నారు. అసలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది, రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది అని నిలదీశారు.
రూ.2 లక్షల రుణం మాఫీ చేయడానికి ఎంత అవుతుందో ప్రభుత్వం వివరించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.