హైదరాబాద్: ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్నగర్కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్లో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ దవాఖానలో ఆమరణదీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. ఇది తన ఒక్కడి కాదని, నిరుద్యోగులందరి సమస్య అంటున్నాడని చెప్పారు. బీఆర్ఎస్ పక్షాన దీక్ష విరమించాలని మోతీలాల్ను కోరామని చెప్పారు.
గ్రూప్-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ఎందుకు వేయడం లేదని, ప్రైమరీ స్కూల్స్లో టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు. అసెంబ్లీని స్తంభింపచేస్తామని చెప్పారు. మోతీలాల్కు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరపాలన్నారు.
Live: Former Minister, MLA @BRSHarish Visits Mothilal Naik, Who Is on an Indefinite Hunger Strike for the Unemployed. https://t.co/whorxplhbA
— BRS Party (@BRSparty) June 30, 2024