హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ (D.Srinivas) మృతిపట్ల మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీశ్ రావు అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మరణం బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సామన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా డీఎస్ ఎదిగారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత డీ. శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. గతకొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని మధ్యహ్నం నిజామాబాద్కు తరలించనున్నారు. ఆదివారం ఉయదం నిజామబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేశారు.