Gurukula Recruitment | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉపాధ్యాయ నియా మక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపా యింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్య ర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు షెడ్యూల్ను ప్రకటిం చాయి. సొసైటీలు ప్రకటించిన షెడ్యూల్ తేదీల్లో గ్రేడ్1, గ్రేడ్2 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు రాతపరీక్షలు ఉండడంతో సొసై టీలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు రీలింక్వెష్మెంట్ విధానంపై స్పష్టత రాకముందే పోస్టింగ్స్ చేపడుతుండడంతో 1: 2జాబితాలో ఉన్న గురుకుల అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడి కి గురవుతున్నారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్నా రిక్రూట్మెంట్ను కొనసా గించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
30వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఎంపికై, ఎంజేపీ బీసీ విద్యాసంస్థల సొసైటీకి అలాటయిన అభ్యర్థులకు 24వ తేదీ నుంచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు షెడ్యూల్ను ప్రకటించా రు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో సంత్ సేవాలాల్ బంజారా భవన్లో వారం రోజుల పాటు 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి ధ్రువప త్రాల పరిశీలన కొనసాగనుంది.
24న లైబ్రేరియన్ (సూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ), ఫిజికల్ డైరెక్టర్, (జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ), డిగ్రీ లెక్చరర్స్, 25న జేఎల్ (ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామి క్స్, కామర్స్, హిస్టరీ), 26న జేఎల్ (హిందీ, తెలుగు, గణితం), పీజీటీ (తెలుగు, హిందీ), 27న పీజీటీ (ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్) ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్-2, 28న టీజీటీ (హిందీ, బయోలాజికల్ సైన్స్, సోషల్), 29న టీజీటీ (ఇంగ్లీష్ , ఫిజికల్ సైన్స్), 30న టీజీటీ (తెలుగు, గణితం) అభ్యర్థులు హాజరు కావాలని స్పష్టం చేశారు.
అభ్యర్థులందరికీ ఇప్పటికే ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపారు. అదేవిధంగా ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి కూడా నూతనంగా నియామకమైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించారు. 24వ తేదీ నుంచి జూలై4 తేదీవరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, జూలై7వ తేదీలో గా పోస్టింగ్స్ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
అదే రోజున హాస్టల్ వెల్ఫేర్ రాతపరీక్షలు
ఎంజేపీబీసీ, ఎస్సీ గురుకుల సొసైటీ లు ప్రకటించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల్లోనే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రేడ్1, గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్, వార్డెన్ తదితర మొత్తంగా 581 పోస్టులకు రాత పరీక్ష కొనసాగనుంది. అందుకు సంబం ధించిన షెడ్యూల్ను కూడా టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉద యం10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా కం ప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ను నిర్వ హించనుంది. సరిగ్గా అవే తేదీల్లో ఎం జేపీ సొసైటీ సైతం సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ను నిర్వహించాలని నిర్ణయిం చింది. దీంతో పలువురు గురుకుల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో అభ్యర్థులు
ట్రిబ్ ఆయా పోస్టులకు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది మొదలు గురుకుల అభ్యర్థులు రీలింక్విష్మెంట్ను అమలు చేయాలని కోరుతున్నారు. డిసెండింగ్ ఆర్డర్ను కూడా పాటించకపో వడంతో భారీగా పోస్టులు బ్యాక్లాగ్లో పడిపోయే అవకాశముందని, అలాకా కుండా ఖాళీగా ఉండే పోస్టులను 1:2 జాబితాలోని తదుపరి మెరిట్ అభ్యర్థుల తో భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించారు. పీడీ, లైబ్రేరియన్ తదితర పోస్టులకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు అనేక అంశాల పై మొత్తంగా 18కేసులు కోర్టుల్లో ఉన్నా యి. వాటిపై ఇప్పటికీ విచారణ కొనసాగు తున్నది. అయితే ట్రిబ్ మాత్రం వెయి టింగ్ జాబితా లేదని, సొసైటీలకు వచ్చిన జాబితా ప్రకారం పోస్టింగ్స్ను ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. ట్రిబ్ నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేని తనంపై రాష్ట్రవ్యా ప్తంగా మరోసారి ఆందోళనలకు సిద్ధమ వుతామని హెచ్చరిస్తున్నారు.
ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం
ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రమోషన్ల షెడ్యూల్ను సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి శనివారం ప్రకటించారు. 317 జీవో ద్వారా డిస్స్ లొకేషన్కు గురైన 1013 మంది ఉద్యోగులకు నూతన జోన్లలో పోస్టింగ్స్ను 26వ తేదీలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. సొసైటీలోని సీనియార్టి జాబితాను 24న ప్రకటించి, 27 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తా మని తెలిపారు. జూలై1న సీనియార్టీ తుది జాబితాను ప్రకటించి, 4న ఫైనల్ చేస్తామని, 5న వెబ్ కౌన్సెలింగ్, 6న ప్రమోషన్ల ఆర్డర్లను ఇస్తామని ప్రకటిం చారు. 7న నూతనంగా సొసైటీలో నియా మకైన అభ్యర్థులకు పోస్టింగ్స్ను ఇస్తామ ని వెల్లడించారు. ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించడంపై సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మికి టిగారియా అధ్యక్షుడు మామి డి నారాయణ, జనరల్సెక్రటరీ డాక్టర్ మధుసూదన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ట్రిబ్ కార్యాలయంలో దివ్యాంగ అభ్యర్థులు ధర్నా
ట్రిబ్ నిర్వాకం వల్ల నాలుగు నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని దివ్యాంగ అభ్యర్థులు డీఎస్ఎస్ భవన్ ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రిబ్ ఇప్పటివరకుది వ్యాంగ క్యాటగిరీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించలేదు. ఆయా సొసైటీలు మాత్రం పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియ ముమ్మ రం చేస్తున్నాయి. వారికి ముందు గా పోస్టింగ్స్ ఇస్తే ఒకే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైనా సర్వీస్లో తాము జూనియర్లుగా పడిపోతామని దివ్యాంగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ జాబితాను వెంటనే ప్రకటించి, అందరితోపా టు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రిబ్ చైర్మన్ను కలిసేందుకు నాంపల్లిలోని అనిసుల్గుర్బాకు వెళ్లినా అందుబాటులో లేరని, కనీసం వినతి పత్రాన్ని అధికారులు తీసుకోలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజల్ట్ను ప్రకటించి పోస్టింగ్స్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని అభ్యర్థులు హెచ్చరించారు.