హైదరబాద్ జూలై 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50 వేల చొప్పున వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఆటో రెన్యువల్ను వర్తింపజేయాలని కోరారు. గెస్ట్లెక్చ రర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
సీఎం రేవంత్రెడ్డిని కలిసే అవకాశం ఇవ్వాల ని సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్ర యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక్క డ నేతలు మాట్లాడుతూ 12 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు రెన్యువల్ విషయంలో కొత్తగా డెమో నిబంధన విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 145 ప్రభుత్వ కళాశాలల్లో 1,600 మంది పనిచేస్తున్న తెలిపారు. పీరియడ్ విధానాన్ని రద్దుచేసి 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలని కోరారు.
గెస్ట్ లెక్చరర్లు అన్న పదాన్ని తొలగించి పార్ట్టైమ్ లెక్చరర్లుగా మార్చాలని, బదిలీ అయినవారి ని రీలొకేట్ చేయాలని డిమాండ్ చేశారు. వి ద్యాశాఖకు మంత్రి లేకపోవడం దౌర్భగ్యమ ని, సమస్యలపై మంత్రులకు వినతిపత్రాలు ఇస్తే చెత్తబుట్టల్లో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో అసోసియేషన్ ప్రతినిధులు చర్చలకు వెళ్లారు.