హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మరో ఎనిమిది జిల్లాల్లో పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయనున్నట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ చెప్పారు. పెట్రోల్ బంక్ల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఇందుకు ఆమోదం తెలిపిందని గురువారం మీడియాకు వెల్లడించారు. వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఈ బంక్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్లను పెట్టినట్టు పేర్కొన్నారు. తొలి విడతలో కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, కొత్తగూడెం, మేడ్చల్, ఖమ్మం, జగిత్యాల్, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలోనే బంక్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.