CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ పేరిట ప్రభుత్వ భూమి ఉన్నట్టు 2009 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, 2023 అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదని ఎక్స్ వేదికగా భరత్ అనే నెటిజన్ పోస్టు చేశారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోపన్పల్లి సర్వే నంబర్ 372, 306, 3, 292లో భాగం ఉన్నట్టుగా, 127 తన పేరు మీద ఉన్నట్టు 2009 ఎన్నికల అఫిడవిట్లో రేవంత్పేర్కొన్నారని నెటిజన్ వివరించారు.
2023 అఫిడవిట్లో 128/ఏఏ మాత్రమే ఉన్నట్టు తెలిపారని వెల్లడించారు. సర్వే నంబర్ 3, 292 అనేవి ప్రభుత్వ భూములని, ఆ ఊర్లో సర్వే నంబర్ 372 లేనేలేదని పేర్కొన్నారు. సర్వే నంబర్ 3, 292 రేవంత్వి అయితే 2023లో ఎందుకు అఫిడవిట్లో పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లతోపాటు, రెవెన్యూ రికార్డుల పత్రాలను కూడా అందులో పోస్ట్ చేశారు.
సీఎం రేవంత్కు వివేకం రావాలి
బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఆకతాయితనంతో వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డిలో వివేకం నెలకొనాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆశించారు. సీఎం రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నతిని ప్రదర్శించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులను తన అనుచరులతో వీరంగం సృష్టించినట్టే.. శనివారం కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరైతే అవే చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి తన ఆకతాయితనాన్ని వీడి వివేకంతో వ్యవహరించాలని సూచించారు.