అమరావతి : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త చెప్పింది. మూడురోజుల పాటు కామారెడ్డి(Kamareddy), నిజామాబాద్(Nizamabad) మీదుగా ఢిల్లీకి వెళ్లేందుకు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది.
కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నంబర్ 12723) తెలంగాణ ఎక్స్ప్రెస్ (Telangana Express) ను జులై 4,5,6 తేదీల్లో నిజామాబాద్ , ముద్కేడ్(Mudkhed) మీదుగా దారిని మళ్లిస్తున్నట్లు పేర్కొంది. న్యూఢిల్లీ -సికింద్రాబాద్ ( నంబర్ 12724) తెలంగాణ ఎక్స్ప్రెస్ను జులై 3,4,5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తామని స్పష్టం చేసింది.
అదే విధంగా సికింద్రాబాద్-నిజాముద్దీన్ (ఢిల్లీ), నిజాముద్దీన్ -సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ రైళ్ల (Durumto Express trains) (నంబర్ 12285/12286) జులై 4,5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపాస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
అయితే దక్షిణ మధ్య రైల్వేజోన్ (South Central Railway) పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లోని ఆసిఫాబాద్- రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా ఈ రైళ్ల దారి మళ్లింపు చేసినట్లు వివరించారు. వీటితో పాటు ఈ మార్గంలో నడిచే 78 రైళ్లను రద్దు చేయడం, 26 ఎక్స్ప్రెస్లను దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు.