Telangana | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు ప్రకటించారు.
జూడాల సమస్యలపై మంగళవారం అర్ధరాత్రి దాకా డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ రోడ్ల నిర్మాణం చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ రోజే రెండు జీవోలను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో గాంధీ జూడాలు సమ్మెను విరమించారు. జీవోలు విడుదల కాకపోతే రేపట్నుంచి మళ్లీ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా నూతన బిల్డింగ్ విషయంలో క్లారిటీ రానిదే తమ సమ్మెను విరమించబోమని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు.