హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జీవో మాజీ మహిళా నేత రంజన (70) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.
ఉద్యోగుల పెన్డౌన్, సకల జనుల సమ్మెతోపాటు అనేక ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులను సంఘటితం చేయడంలో రంజన ప్రధాన భూమిక పోషించారు. ఆమె మృతికి స్వామిగౌడ్, దేవీప్రసాద్ సంతాపం ప్రకటించారు. జాంబాగ్లోని ఆమె నివాసంలో మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.