హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ఆడుతున్న రాజాకీయ డ్రామాలో జస్టిస్ నర్సింహారెడ్డి పావుగా మారారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. కేసీఆర్ కీర్తిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మసిపూయాలనే రాజకీయ దుగ్ధతోనే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చట్ట విరుద్ధమైన విచారణ కమిషన్ వేశారని ధ్వజమెత్తారు. కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలని కాదని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కమిషన్ పనితీరు సాగుతున్నదని ఆరోపించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రాజకీయ కమిషన్గా ఆయన అభివర్ణించారు.