హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : విభజన సమస్యలపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా సీఎం రేవంత్రెడ్డి చర్చలు జరపాలని, వ్యక్తిగత సంబంధాలను పక్కనబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూ చించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆ యన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్రెడ్డి మధ్య గత సంబంధాల నేపథ్యంలో ప్రజలకు అపోహాలున్నాయ ని, రేవంత్రెడ్డి తెలంగాణకు రక్షణకవచంలా ఉండి చర్చలు జరపాలని కోరారు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పనిచేసిందని చెప్పారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నారని, విభజన సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకోవాలని కోరారు. ఏడు మండలాలను ఏపీలో కలపడంతో భద్రాచలంలో వాహన పారింగ్కు, డంపింగ్ యార్డ్కు స్థలం లేకుండాపోయిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని, అప్పుడు ఆంధ్రాలో కలిపితే తప్ప తాను బాధ్యతలు తీసుకోను అని చంద్రబాబు చెప్పారని, తిరిగి ఆ మండలాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ర్టాలకు రావాల్సిన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కార్యాలయాల్లోనూ వాటా కోసం ఏపీ వితండవాదం చేయడం కరెక్ట్ కాదని, ఆస్తులు, ఆర్టీసీ, దిల్ వంటి సంస్థలపై విభజన హామీలు పక్కాగా అ మలు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ చుట్టుపకల విలువైన ఆస్తులున్నాయి కాబట్టే ఏపీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దిల్ అనే సంస్థకు చెందిన ఐదువేల ఎకరాల భూమిపై ఏపీ కన్నువేసిందని ఆరోపించారు. ఇక్కడి ఆస్తులపై ఏపీ వాటా అడుగుతున్నదని, విజయవాడ, తిరుపతిలో మ నం వాటా ఇవ్వాలని అడుగుతున్నామా? అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా ఏపీ అడుగుతున్నదని చెప్పారు.