హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసిందని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జస్టిస్ నరసింహారెడ్డి తన భార్య పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా చేశారని గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ధర్నా లు, రాస్తారోకోలు చేసిన విషయాన్ని ఆయ న ఉదహరించారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నాడు ఓయూలో కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లి గొడవ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కబ్జాకోరు అని ముద్ర వేసిన కాంగ్రెస్ వాళ్లే ఆయనకు కమిషన్ బాధ్యతలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.