TGSPSC | హైదరాబాద్ : నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సాధారణ వ్యక్తులను కూడా పోలీసులు వదలి పెట్టడం లేదు.
ఓ రైతు లుంగీ కట్టుకోని మరో ఇద్దరితో కలిసి నాంపల్లి ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు ఆ రైతుతో పాటు మరో ఇద్దరిని అడ్డుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. తాను తన కొడుకు కాలేజీ కోసం వచ్చానని సదరు రైతు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ధర్నాకు రాలేదని మొత్తుకుంటుంటే.. మరి ఎక్కడికి వచ్చావంటూ రైతును ప్రశ్నిస్తూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అమాంతం ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై సదరు రైతు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం రైతుతో పాటు మరో ఇద్దరిని గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఓ లాయర్ పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మరి అతని బైక్ ఆపి పోలీసు వాహనంలో ఎక్కించారు. పోలీసు లాయర్ గల్లా పట్టుకోవడంతో ఆయన ఊగిపోయారు. ఇదేనా పోలీసులు ప్రవర్తించే తీరు అని మండిపడ్డారు. ధర్నాతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆ లాయర్ వాపోయారు. మరో ఇద్దరు యువకులను కూడా అకారణంగా అరెస్టు చేశారు.
పోలీసుల విచిత్ర ధోరణి
టీజీఎస్పీఎస్సీ వద్ద రోడ్డు మీద పోయేవాళ్ళని సైతం అరెస్ట్ చేస్తున్న పోలీసులు
మేము ధర్నా కోసం రాలేదు రోడ్డు మీద వెళ్తున్నాం అని చెప్తున్న ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/ty71tEDmku
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024