హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన విజువల్లీ హ్యాండీకాప్డ్ అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి 27 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం టీజీపీఎస్సీ వెబ్నోట్ విడుదల చేసింది. సరోజినీదేవి హస్పిటల్లో ఉదయం 8 గంటలకు తప్పకుండా హాజరు కావాలని అభ్యర్థులకు సూచించింది. కంటి పరీక్షలకు హాల్టికెట్, రెండు పాసుపోర్టు సైజు ఫొటోలు, ఆధార్కార్డు, విజువల్లీ హ్యాండీకాప్డ్కు సంబంధించిన సర్టిఫికెట్ను వెంట తెచ్చుకోవాలని వెబ్నోట్లో తెలిపింది.
ప్రమోషన్లు, బదిలీలకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల అంశాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించినట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో జీవో 317 ద్వారా బదిలీ అయిన ఉద్యోగుల నుంచి బంజారాహిల్స్లోని సేవాలాల్ బంజారాభవన్లో మంగళవారం అభ్యంతరాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. పత్రాల పరిశీలన అనంతరం తుదినిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అఫిడవిట్లపై పునరాలోచించాలి
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ డెఫిషియన్సీపై అఫిడవిట్లు సమర్పించాలన్న ఆలోచనపై పునరాలోచించాలని తెలంగాణ స్కూల్ అండ్ టెక్నికల్ కాలేజీస్ ఎంప్లాయీస్ అసొసియేషన్(టక్సా) అధ్యక్షుడు సంతోష్కుమార్ జేఎన్టీయూను కోరారు. ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లను నియమించుకోకుండా, అఫిడవిట్ దాఖలు చేయడమంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే అవుతుందని తెలిపారు.
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసొసియేషన్ కోరింది. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రాన్ని అందజేశారు.