హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖత్ అయ్యారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కవితను మంగళవారం వారు కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాసేపు వారు చర్చించుకున్నట్టు సమాచారం.