హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని అర్హుడిగా భావించి వారికి సీట్లు కేటాయించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ, తెలంగాణ కమిటీ డిమాండ్ చేశాయి. మెరిట్ పేరుతో విద్యార్థులకు అన్యాయం చేయవద్దని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు పాపని నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకటేశ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
4 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడుత రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు. రిజిస్ట్రేషన్ గడువు మంగళవారంతో ముగియగా, ఈ నెల 4 సాయంత్రం 5గంటల వరకు గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. వెబ్ ఆప్షన్లకు బుధవారం వరకు గడువుండగా, ఈ గడువును సైతం ఈ నెల 4 సాయంత్రం 5గంటల వరకు పొడిగించామని తెలిపారు.