నాగర్కర్నూల్ టౌన్, జూన్ 23: నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్, బీజేపీ నేతలు భరత్ప్రసాద్, సుధాకర్రావు ఆదివారం పరామర్శించారు. అంతకుమందు జాటోత్ హుస్సేన్నాయక్, భరత్ప్రసాద్ మొలచింతలపల్లి గ్రామాన్ని సందర్శించి ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హుస్సేన్నాయక్ మాట్లాడుతూ.. ఆమెకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని కలెక్టర్ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 6 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. ఈశ్వరమ్మ కుటుంబానికి 25 ఏండ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి, ఇంటి పత్రాలను వెంటనే వారి పేర చేయాలని అధికారులకు ఆయన చెప్పారు.