Gurukula Societies | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 5 గురుకుల సొసైటీల ఉ ద్యోగ, ఉపాధ్యాయులు ఒకే రిక్రూట్మెంట్ వి ధానంలో భర్తీ అవుతారు.. వారందరికీ విధు లు ఒకేలా ఉంటాయి.. కానీ, పాఠశాల ప్రారం భ వేళ నుంచి ప్రమోషన్లు, జీతభత్యాల్లో ఒకో విధమైన వ్యత్యాసం కనబడుతున్నది. ఫలితంగా ఎందరో ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ప్రమోషన్లు నిర్వహిస్తున్న నేపథ్యం లో గురుకుల సొసైటీల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో 1,043 గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఆయా గురుకులాలు వేటికవే భిన్నమైన సర్వీస్రూల్స్, గైడ్లైన్స్ పాటించడం వారికి శాపంగా మారుతున్నాయి. భిన్నమైన సర్వీస్ రూల్స్ వల్ల కొందరికి మోదం, మరికొందరికీ ఖేదం గా పరిణమించిందని ఉద్యోగులు వాపోతున్నారు. బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్ ఏర్పాటవుతున్న తరుణంలో పాతవాటికి భిన్నంగా వాటి నిర్వహణకు గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకున్నాయి. జనరల్ గురుకుల సొసైటీ నుంచి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విడిపోతున్న తరుణంలో చాలామంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు బీసీ రెసిడెన్షియన్స్ను ఆప్షన్ ఎం చుకొని వెళ్లారు. ఆ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు వచ్చాయి. దీంతో జనరల్ గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కంటే బీసీ రెసిడెన్షియల్కు వెళ్లిన జూనియర్లయిన చాలామంది ఉద్యోగులు ప్రమోషన్లతో లాభపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపాల్స్ భర్తీ
సాధారణంగా స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులను 100 శాతం ప్రమోషన్ల ద్వారానే, ఇన్సర్వీస్లో ఉన్నవారితోనే భర్తీ చేయాలి. గురుకుల సొసైటీల్లో అందుకు భిన్నమైన సర్వీస్రూల్స్ ఉన్నాయి. కొన్ని సొసైటీలు 70 శాతం పోస్టులను, మరికొన్ని సొసైటీలు 50 శాతం పోస్టులనే ప్రమోషన్ల ద్వారా భర్తీచేస్తూ మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. అదీగాక ఇన్సర్వీస్లో లేనివారికి సైతం అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
30 ఏండ్లయినా ప్రమోషన్ నిల్
సోషల్ వెల్ఫేర్ సొసైటీలో డీఎల్ పోస్టులను 70:30 నిష్పత్తిలో గాకుండా 30:70 నిష్పత్తిలో నింపుతున్నారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ కారణంగా ఒకే రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైనా ప్రమోషన్లు, బేసిక్ పేలో అన్యాయానికి గురవుతున్నామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న సర్వీస్రూల్స్ కారణంగా జనరల్ గురుకుల సొసైటీల్లో కొంతమంది ఉపాధ్యాయులు 30 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకు న్నా ఒక ప్రమోషన్ కూడా తీసుకోలేదని బాధిత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
బేసిక్ పేలోనూ తీవ్ర అన్యాయం
టీజీపీఎస్సీ ద్వారా నియమితులైన గురుకుల ప్రిన్సిపాళ్లకు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు ఆప్షన్ తీసుకున్న వారికి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కు గ్రేడ్ 1 బేసిక్ పే చెల్లిస్తుండగా, అదే రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన ఇతర సొసైటీల ప్రిన్సిపాళ్లు మాత్రం జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లుగానే విధులు నిర్వహిస్తూ సూల్ ప్రిన్సిపాల్ గ్రేడ్ 2 బేసిక్ పే మాత్రమే తీసుకుంటున్నారు. మూడేండ్లు దాటిన వారికీ గ్రేడ్1గా ప్రమోషన్లు ఇవ్వడం లేదు.
పనివేళల్లో చాలా వ్యత్యాసం
గురుకులాల పనివేళలల్లో కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. జనరల్, బీసీ గురుకులాలు ఉదయం 7:30 నుంచి ప్రారంభమవుతుండగా, ఇతర సొసైటీ పాఠశాలలు 9.30 నుంచి ప్రారంభమవుతున్నాయి. మైనార్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ వార్డెన్ ఉండగా, ఇతర సొసైటీల్లో ఒక ఉపాధ్యాయుడికి డిప్యూటీ వార్డెన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని గురుకుల సొసైటీల్లో ఒకే విధమైన గైడ్లైన్స్ ఏర్పాటుచేసి అందరికీ సమన్యాయం చేయాలని, ఆ తర్వాతే ప్రమోషన్లు చేపట్టాలని వివిధ గురుకుల ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.