MLA Raja Singh | ముంబై: హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదివారం గోవాలో జరిగిన వైశ్విక్ హిందూ రాష్ట్ర మహోత్సవ్లో ప్రసంగిస్తూ ప్రస్తుతం పలువురు రాజకీయ వేత్తలు హిందుత్వ వాదులుగా నటిస్తున్నారని, తీరా వారు ఎన్నికైన తర్వాత లౌకిక వాదులుగా మారిపోతున్నారని అన్నారు. ఇలాంటి వారి బుజ్జగింపు రాజకీయాల కారణంగా హిందూ భారత్ అచేతనం అయిపోతున్నదన్నారు.
అయితే హిందూ రాష్ట్ర ఏర్పాటుకు అలాంటి ఎంఎల్ఏలు, ఎంపీలు ఎంతమాత్రం పనికి రారని అన్నారు. స్థిరంగా, దృఢంగా హిందుత్వ భావాలను వ్యక్తం చేయగల 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.