DSC 2008 | హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎస్సీ 2008 బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే అని డీఎస్సీ 2008 బాధితులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Voter Enrollment | ఓటరు నమోదుకు మరో చాన్స్.. అక్టోబర్ 28 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం
Weather Update | రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు