కల్వకుర్తి రూరల్, జూన్ 24 : పెండింగ్లో ఉన్న పాల బిల్లులను(Milk bills) వెంటనే ఖాతాల్లో జమ చేయాలని పాడిరైతులు(Dairy farmers) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద సోమవారం తాండ్ర, పోతెపల్లి, జూపల్లి గ్రామాల పాడి రైతులు, ఆయా పార్టీల నాయకులు శ్రీశైలం-కల్వకుర్తి ప్రధాన రహదారిపై ధర్నా(Dharna) చేపట్టారు. ఈ సందర్భంగా పాడిరైతులు మాట్లాడుతూ విజయ పాల డెయిరీ(Vijaya dairy)నుంచి రెండు నెలలుగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మన్నారు.
ప్రతి రైతుకు దాదాపుగా రూ.50 వేల వరకు పాల డబ్బులు రావాల్సి ఉందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి పెండింగ్ డబ్బులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్వకుర్తి పోలీసులు అక్కడికి చేరుకొని సంబంధిత శాఖాధికారులతో మాట్లాడించడంతోపాటు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో పాడి రైతులు హన్మంతు, సంతోష్రెడ్డి, మల్లేశ్, కృష్ణ, జంగయ్య, నాయకులు ఆంజనేయులు, మైబు, ఆనంద్, శ్రీను, శివయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.