సూర్యాపేట : భూ వివాదం(Land disputes) కోర్టులో ఉండగానే తన భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్(Illegal registration) చేశారని ఆరోపిస్తూ.. బాధితుడి కుటుంబం సూర్యాపేట(Suryapet) జిల్లా నూతనకల్ తహసీల్దార్ కార్యాలయం(Tehsildar office) ఎదుట ఆందోళకు దిగారు. తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదం కోర్టులో ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని మాచలపల్లి గ్రామానికి చెందిన బాధితుడు మోరిగాల రమేష్ ప్రశ్నించారు.
గతంలో ఇక్కడ పని చేసిన తహసిల్దార్ జామీన్పై పలు ఆరోపణలు చేశారు. ఎకరం పది గుంటలు సుమారు కోటి రూపాయలు విలువ చేసే భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.