హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మంగళవారం జరిగిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రవేశపెట్టనున్నారు.
వ్యవసాయ రంగానికి కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి జిల్లా ల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, కళాశాలలే లేని జిల్లాల వివరాలపై వారు చర్చించారు. సీడ్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపైనా ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలల్లో విత్తన అభివృద్ధి తీరుపైనా చర్చించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలేంటి? అందుకు గల కారణాలను డిప్యూటీ అడిగి తెలుసుకున్నారు.
సమావేశం లో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శా ఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు, ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ పాల్గొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించేందుకు నీటిపారుదలశాఖ మంగళవారం జలసౌధలో సమావేశమైంది. వివిధ సరిళ్ల సీఈలు, వివిధ విభాగాల ఇన్చార్జులు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులకు బడ్జెట్ ప్రతిపాదనల్లో అగ్రస్థానం కల్పించాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు.