హైదరాబాద్ : రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. సోమవారం మాదాపూర్ హైటెక్స్(Madapur Hitex) ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను (Dairy Conference-2024) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.