హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఎస్టీ గురుకుల టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. 2,334 మందికి బదిలీలు, 195 మందికి పదోన్నతులు దక్కాయని వెల్లడించారు.
86 హెడ్మాస్టర్లు, 695 స్కూల్ అసిస్టెంట్లు(సమాన క్యాడర్), 1,553 మంది ఎస్జీటీలు ప్రయోజనం పొందినట్టు అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్రెడ్డి తెలిపారు.