హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా నామినేట్ కావటానికి తన న్యాయపోరాటంలో అడ్డురావొద్దని, తనకు సహకరించాలని ప్రొఫెసర్ కోదండరాంకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కోదండరాంకు బహిరం గ లేఖ రాశారు. ‘వెనుకబడిన వర్గాల హకులను కాలరాయాలని రేవంత్రెడ్డి కుట్రలు చేస్తుంటే, సహకరించాలని మీకు మనసు ఎలా వచ్చింది? నాలాంటి వెనుకబడ్డ వారికి రాజకీయ అవకాశాలు రావు. వచ్చినా డబ్బుసంచులతో మమ్మల్ని ఓడగొడతారు.
నేను కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. నా న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వండి. ఎమ్మెల్సీగా నేను నియామకం పొందే వరకు తోడ్పాటును అందించాలి’ అని లేఖలో కోరారు. ఉద్యమ వ్యతిరేకి అయిన రేవంత్.. లీగల్ లిటిగేషన్లో తమను ఇరికించి పరోక్షంగా అవమానిస్తున్న విష యం బోధపడ టం లేదా? అని ప్రశ్నించారు.
‘మీకు కచ్చితంగా పదవి దక్కాలి. రేవంత్రెడ్డికి కృతజ్ఞత ఉంటే.. రాజ్యసభకు పంపించి ఉండొచ్చు. ఎమ్యెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నియమించి ఉండొచ్చు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి, ఆర్నెల్లలోపు ఎమ్మెల్సీగా నియమించి ఉండొచ్చు. ఎమ్మెల్సీ నియామకాలు వచ్చే వరకు మంత్రిగా కొనసాగించి ఉండొచ్చు కదా’ అని పేర్కొన్నారు.